కర్ణాటక ప్లేయర్ తో టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ పెళ్లి

-

టీమిండియా మహిళా క్రికెటర్, ఆల్ రౌండర్ వేద కృష్ణమూర్తి పెళ్లి చేసుకుంది. కర్ణాటకకు చెందిన క్రికెటర్ అర్జున్ హోసలా, వేదా కృష్ణమూర్తి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఒక్కటయ్యారు. కరోనాతో మరణించిన తల్లి పుట్టిన రోజునే వేద కృష్ణమూర్తి వివాహం చేసుకోవడం విశేషం.

2021 జూలైలో భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి ఇంట్లో కరోనా వైరస్ కారణంగా రెండు విషాదాలు జరిగాయి. కరోనా బారిన పడి తోలుతా ఆమె తల్లి ప్రాణాలు కోల్పోగా, నాలుగు వారాల వ్యవధిలో అక్క కూడా మరణించింది. పెళ్లి గురించి సోషల్ మీడియాలో చేసిన పోస్టులో ఈ ఇద్దరిని గుర్తు చేసుకుంది వేదా కృష్ణమూర్తి.

‘మిస్టర్ అండ్ మిసెస్ లవ్. అమ్మ నీ కోసమే ఇది. నీ పుట్టిన రోజు ఎప్పటికీ నా స్పెషల్ గా గుర్తుండిపోతుంది. లవ్ యు అక్క, జస్ట్ మ్యారీడ్’, అంటూ ఇన్స్టా లో పోస్ట్ చేసింది వేదా కృష్ణమూర్తి.

Read more RELATED
Recommended to you

Exit mobile version