IND VS RSA : టెస్ట్ సిరీస్‌కు ఐరన్ లెగ్ అంపైర్ దూరం

-

భారత్-సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ నుంచి అంపైర్ కెటిల్ బరో వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారు. ఈ క్రమంలో అతడి స్థానాన్ని లాంగ్టన్ రుసేరేనుతో ఐసీసీ భర్తీ చేసింది. దీనిపై అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అతడు అంపైర్ గా వ్యవహరించిన చాలా మ్యాచుల్లో ఇండియా ఓటమి పాలైంది.

దీంతో అతన్ని ఐరన్ లెగ్ అంటున్నారు భారత్ ఫ్యాన్స్. వరల్డ్ కప్ 2023 ఫైనల్స్ లో కూడా కెటిల్ బరో ఫీల్డ్ అంపైర్ గా ఉన్నారు. కాగా, దక్షిణాఫ్రికా పర్యటనలో టీ20 సిరీస్ ను సమం చేసుకుని…. వన్డే సిరీస్ చేజిక్కించుకున్న టీం ఇండియా ఇప్పుడు అసలు సిసలు సమరానికి సమాయత్తమైంది. ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు మంగళవారం తెరలేవనుంది. పేస్ కు సహకరించే సెంచూరియన్ లో ఇరు జట్ల మధ్య నేటి నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. మరి ఇవాళ్టి బాంక్సింగ్‌ డే టెస్ట్‌ మ్యాచ్‌ ను టీమిండియా ఎలా ఆడుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news