ముంబై కెప్టెన్సీ కోల్పోయిన రోహిత్ శర్మకు మరో షాక్!

-

MI కెప్టెన్సీ పోగొట్టుకున్న రోహిత్ శర్మకు మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. రోహిత్ అంతర్జాతీయ టీ20 కెప్టెన్సీ కూడా కోల్పోయేలా కనిపిస్తోంది. ప్రస్తుతం సూర్య తాత్కాలిక కెప్టెన్ గా ఉన్నారు. వచ్చే ఏడాది జరగనున్న టీ20 WCకు హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేస్తారని సమాచారం.

It seems that Rohit Sharma will get another shock after losing the captaincy of MI

2022 టీ20 WC తర్వాత రోహిత్ ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. ఇకపై ఆడే అవకాశం కూడా లేకపోవడంతో కెప్టెన్సీపై నీలినీడలు కమ్ముకున్నాయి. కాగా, ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పుపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మకు కనీస గౌరవం ఇవ్వలేదని, ఆకస్మాత్తుగా తొలగించారని ఫైర్ అవుతున్నారు. దేశంలోని పలు నగరాల్లో ముంబై జెర్సీలను కాల్చి వేస్తున్నారు. ఇన్ని రోజులు హిట్ మ్యాన్ పై ఇష్టంతోనే ముంబై ఇండియన్స్ ను సపోర్ట్ చేశామని, ఇకనుంచి పట్టించుకోమని పోస్టులు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news