BREAKING : ఆసుపత్రిలో చేరిన మహ్మద్ షమీ..ఫోటో వైరల్

-

BREAKING :  టీం ఇండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ ఆసుపత్రిలో చేరాడు. గాయం కారణంగా ఇప్పటికే బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ కి దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. టెస్టుల్లోనూ ఆడేది అనుమానం గానే కనిపించింది.

అయితే కారణమేంటో వెల్లడించకపోగా షమీ కొన్ని ఫోటోలు ట్విట్ చేశాడు. ఆసుపత్రిలో బెడ్ పై ట్రీట్మెంట్ తీసుకుంటూ కనిపించాడు. తన కెరీర్ లో గాయాలు ఓ భాగమైపోయాయని, గాయాల నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు. కాగా, రేపటి నుంచే ఇండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. హోం సిరీస్ లో భాగంగా భారత్ తో బంగ్లాదేశ్ మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. డిసెంబర్ 4న జరగనున్న తొలి వన్డే తో భారత పర్యటన ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news