పాకిస్థాన్ ఇష్యూ..భారత క్రికెటర్ సంచలన పోస్ట్

-

rahul tewatia: బాలీవుడ్ సెలబ్రిటీల్లో కొందరు పాలస్తీనాకు మద్దతుగా పోస్టులు చేస్తున్న వేళ భారత క్రికెటర్ రాహుల్ తెవాటియా సంచలన పోస్ట్ చేశారు. ఆయన పాకిస్తాన్ లోని హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాల అంశాన్ని లేవనెత్తారు.

rahul tewatia’s post about hindus in pakistan goes viral

‘అందరి దృష్టి పాకిస్తాన్ లోని హిందువులపై ఉంది’ అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టారు. కాగా, గాజాలోని రఫా ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడులపై పలువురు సెలబ్రిటీలు ALL EYES ON RAFAH అని పోస్టులు చేస్తున్నారు.

ఇక అటు ఇజ్రాయెల్-హమాస్​ యుద్ధం వల్ల ఎంతో మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇజ్రాయెల్ – పాలస్తీనా దేశాలు సమన్వయంతో చర్చలు జరిపి ఓ నిర్ణయానికి రావాలని.. ఈ మారణహోమాన్ని ఆపాలని కోరుతున్నాయి. అయితే ఈ వ్యవహారంలో కొన్ని దేశాలు ఇజ్రాయెల్​కు మద్దతు పలుకుతోంటే.. మరికొన్ని పాలస్తీనాకు అండగా నిలుస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news