బెంగుళూరు పై రాజస్థాన్ ఘన విజయం

-

2024 ఐపీఎల్​లో రాజస్థాన్​ రాయల్స్​ విజయ యాత్ర కొనసాగుతోంది. ఈ​ టోర్నీలో రాజస్థాన్ వరుసగా నాలుగో విజయం సాధించింది. శనివారం రోజున జైపుర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ గెలుపు పొందింది. బెంగళూరు నిర్దేశించిన 184 పరుగుల టార్గెట్​ను 4 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో ఛేదించింది. జాస్ బట్లర్ (100* పరుగులు), కెప్టెన్ సంజూ శాంసన్ (69 పరుగులు, 42 బంతుల్లో; 8×4, 2×6) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఆర్సీబీ బౌలర్లలో రీస్ టోప్లే 2, మహ్మద్ సిరాజ్​, యశ్ దయాల్ తలో వికెట్ దక్కించుకున్నారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు నష్టానికి 183 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్​లో విరాట్ సూపర్ సెంచరీ (113 పరుగులు, 72 బంతుల్లో ; 12×4, 4×6)తో బెంగళూరుకు మంచి స్కోర్ కట్టబెట్టాడు. మరో ఓపెనర్ ఫాఫ్ డూప్లెసిస్ (44 పరుగులు, 33 బంతుల్లో) రాణించాడు.  ఇది బెంగళూరుకు వరుసగా మూడో ఓటమి. ప్రస్తుత సీజన్​లో ఐదు మ్యాచ్​లు ఆడిన ఆర్సీబీ నాలుగు మ్యాచ్​ల్లో ఓడి కేవలం ఒక దాంట్లోనే నెగ్గింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version