బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చే ఆలోచన చేస్తున్నాం: ఎర్రబెల్లి

-

భారత్ రాష్ట్ర సమితి పార్టీని తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చబోతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపైన మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ గా తిరిగి మార్చే ఆలోచనలో ఉన్నామని ఆయన తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని రాజీవ్‌చౌరస్తాలో శనివారం నిర్వహించిన రైతు దీక్షలో ఆయన ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తనకు జైళ్లు కొత్తేమీ కాదని.. గతంలో పోరాటాలు చేసి మహారాష్ట్ర, అనంతపురం, వరంగల్‌లో ప్రజల కోసం కారాగారానికి వెళ్లొచ్చానని తెలిపారు. ఇప్పుడు మళ్లీ తనను కేసుల్లో ఇరికిస్తామని ఈ సర్కార్‌, నాయకులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. మరోసారి ప్రజల కోసం జైలుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క అవినీతి మచ్చ కూడా లేకున్నా కొందరు కావాలనే బెదిరిస్తున్నారని విమర్శించారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని, మళ్లీ పాలకుర్తి నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version