ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా RCB.. 18 ఏళ్ళ తర్వాత

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఛాంపియన్గా… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచింది. ఎవరు ఊహించని విధంగా 18 సంవత్సరాల తర్వాత ఛాంపియన్ అయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. పంజాబ్ కింగ్స్ జట్టు పైన ఏకంగా ఆరు పరుగులు తేడాతో విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు…. అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది.

RCB crowned IPL champions, 18-year-long wait for Virat Kohli, Bengaluru ends
RCB crowned IPL champions, 18-year-long wait for Virat Kohli, Bengaluru ends

దీంతో 18 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు శశాంక్ సింగ్ చివరి వరకు పోరాటం చేసిన కూడా మ్యాచ్ గెలవలేకపోయారు. చివర్లో 30 పంతులు లోనే 61 పరుగులు చేసిన శశాంక్ సింగ్… రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు చుక్కలు చూపించాడు. కానీ భువనేశ్వర్ అద్భుతమైన బంతులు.. వేయడంతో… రాయల్ చాలెంజ్ చేస్తే బెంగళూరు జట్టు ఛాంపియన్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news