IND VS RSA : ఇవాళ సఫారీలతో టీమిండియా మొదటి టీ20 మ్యాచ్

-

South Africa vs India, 1st T20I : టీమిండియా మరో రసవత్తర పోరుకు సిద్ధమైంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్న టీమిండియా జట్టు… సఫారీలతో మొదటి టీ20 మ్యాచ్ ఇవాళ ఆడనుంది. ఈ మ్యాచ్ డర్బన్ వేదికగా జరగనుంది. ఎప్పటిలాగే సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో ఈ టి 20 మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇందులో సూర్య కుమార్ టీమిండియా కెప్టెన్గా వ్యవహరించనున్నారు.

South Africa vs India, 1st T20I

ఇప్పటికే ఆస్ట్రేలియాపై గ్రాండ్ విక్టరీ కొట్టిన టీమిండియా సఫారీలను కూడా ఓ ఆట ఆడుకునేందుకు సిద్ధమైంది. కాగా దక్షిణాఫ్రికా వేదికగా మూడు టి20 లు ఆడనుంది టీమిండియా. అలాగే మరో మూడు వన్డే మ్యాచ్లు కూడా ఆడనుంది. ఈ వన్డే మ్యాచ్ లకు kl రాహుల్ కెప్టెన్గా వ్యవహరించాలన్నారు. అంతేకాకుండా రెండు టెస్టు మ్యాచ్లు కూడా డిసెంబర్ 26వ తేదీ నుంచి ఆడనుంది టీం ఇండియా. ఈ టెస్ట్ మ్యాచ్ లకు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉండనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news