T20 World Cup సంబురాలు.. తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ఫ్యాన్స్ పూనకాలు

-

17 ఏళ్ల తర్వాత భారత్‌ టీ20 ప్రపంచ కప్పును ముద్దాడింది. టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన వేళ దేశవ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. క్రికెట్ అభిమానుల ఏళ్ల కోరిక నెరవేరడంతో అంతా ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. దేశంలో ఎక్కడ చూసినా క్రికెట్‌ అభిమానుల కేరింతలే కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి సమయంలో అభిమానులంతా రోడ్లపైకి వచ్చి సంబురాలు చేసుకున్నారు. టపాసులు పేల్చి వరల్డ్ కప్ను ముద్దాడిన టీమిండియాకు ఘనంగా నీరాజనాలు పలికారు.

ముఖ్యంగా హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌కు పెద్ద ఎత్తున చేరుకున్న క్రికెట్‌ అభిమానులు బాణసంచా పేలుస్తూ ఘనంగా వేడుకలు నిర్వహించారు. సచివాలయం వద్ద జాతీయ జెండా పట్టుకొని, టపాసులు కాలుస్తూ యువత సందడి చేశారు. భారత్‌ మాతాకీ జై… అని నినాదాలు చేస్తూ తమ సంబురాలు అంబరాన్నంటేలా సెలబ్రేట్ చేసుకున్నారు. భారీగా అభిమానులు చేరుకోవడంతో ట్యాంక్‌ బండ్‌, సచివాలయం పరిసర ప్రాంతాల్లో కిలో మీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులకు ట్రాఫిక్ను కంట్రోల్ చేసేందుకు చాలా సమయమే పట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news