వరల్డ్ కప్ లో రేపు “డబుల్ ధమాకా”, సెమీస్ పై ఒక అంచనా వచ్చేనా ?

-

వరల్డ్ కప్ ఎవ్వరూ అనుకున్నట్లు జరగడం లేదు.. ఎన్నో ట్విస్ట్ లతో చాలా ఆసక్తికరంగా ముందుకు వెళుతోంది. సెమీస్ కు వెళ్లే వాటిలో ఇండియా ఒక్కటే బెర్త్ ను కంఫర్మ్ చేసుకుంది.. మిగిలిన మూడు జట్లు ఏవో ఇంకా తెలియాల్సి ఉన్నాయి. కాగా రేపు వరల్డ్ కప్ లో డబుల్ ధమాకా జరగనుంది.. ఉదయం జరగనున్న మ్యాచ్ లో పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ లు తలపడనుండగా, మధ్యాహ్నం మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లు పోటీ పడనున్నాయి. కాగా మొదటి మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలిస్తే సెమీస్ చేరడానికి ఆశలు మరింత బలపడతాయి.. ఒకవేళ పాకిస్తాన్ గెలిస్తే ఆఫ్గనిస్తాన్ కు పాజిటివ్ గా మారే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్, ఆఫ్గనిస్తాన్ మరియు పాకిస్తాన్ లు వరుసగా నాలుగు, అయిదు మరియు ఆరు స్థానాలలో ఉన్నారు. గెలిస్తే కివీస్ కు పది పాయింట్లు దక్కుతాయి ఓడిపోతే ఎనిమిది పాయింట్ లతో ఇంకా కిందకు వచ్చే అవకాశం ఉంది. పాకిస్తన గెలిస్తే ఆఫ్ఘన్ ను దాటి పైకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి..

ఇక మరో మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా లు తలపడనుండగా ఆస్ట్రేలియా ఓడిపోతే సెమీస్ రేస్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మరి ఏమి జరగనుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version