టీమిండియా బౌలర్ల ధాటికి శ్రీలంక 215 ఆలౌట్

-

మొదటి వన్డేలో సాధించిన విజయంతో ఊపుమీదున్న టీమిండియా బౌలర్లు రెండో మ్యాచ్‌లోనూ చెలరేగారు. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో లంకేయులను 215 పరుగుకే కట్టడి చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక టీమిండియా బౌలర్ల ధాటికి 39.4 ఓవర్లలో 215 ఆలౌట్ అయింది. లంక లోయర్ ఆర్డర్ పోరాడబట్టి ఆ మాత్రమైనా స్కోరు వచ్చింది.

లంక జట్టులో కొత్త ఓపెనర్ నువనిదు ఫెర్నాండో 50 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కుశాల్ మెండిస్ 34, దునిత్ వెల్లాలగే 32, కరుణరత్నే 17, కసున్ రజిత 17 పరుగులు చేశారు. గత మ్యాచ్ లో వీరోచిత సెంచరీతో అలరించిన లంక సారథి దసున్ షనక ఈ మ్యాచ్ లో 2 పరుగులకే వెనుదిరిగాడు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 3, కుల్దీప్ యాదవ్ 3, ఉమ్రాన్ మాలిక్ 2, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version