శ్రీనివాస్ ని జ్యుడీషియల్ కస్టడీకి ఇస్తారా?లేదా?

-

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో కత్తితో దాడికి దిగిన శ్రీనివాస్ పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో నేడు జ్యుడీషియల్ కస్టడికీ అప్పగించాల్సి ఉంది…కానీ కేసును విచారణ చేపట్టిన సిట్ (స్పెషల్ ఇన్వెష్టిగేషన్ టీం) మరి కొద్ది రోజుల పాటు పోలీసు కష్టడీని కోరనున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను సైతం విచారించడానికి అనుమతి కోరనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే శ్రీనివాస్ కాల్ డేటా ఆధారంగా కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. దీంతో నేడు కోర్టు తీసుకునే నిర్ణయం పై  సర్వత్రా చర్చనీయాంశమైంది. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం శ్రీనివాస్ ని తెదేపా నాయకులు మట్టుబెట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపణలు చేయడంతో పాటు శ్రీనివాస్ కి ప్రజల మధ్యలో మాట్లాడే విధంగా అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news