SSMB 29 : మహేశ్ బాబు ఎస్‌ఎస్‌ఎంబీ 29 కోసం భారీ సెట్టు రెడీ.. క్రేజీ అప్‌డేట్స్‌ ఆన్ ది వే…..

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరో గా త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరుకారం .ఈ చిత్రాన్ని 2024 జనవరి 13న సంక్రాతికి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ విడుదల కాకముందే ఎస్‌ఎస్‌ఎంబీ 29 కు సంబంధించిన అప్‌డేట్ సోషల్ మీడియాలో హల్‌ చల్ చేస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు రాజమౌళి షురూ చేశాడట.

ఈ సినిమా కోసం రామోజీఫిలిం సిటీలో ఏకంగా రూ.100 కోట్ల ఖర్చుతో భారీ సెట్టు వేసే ప్లాన్‌లో రాజమౌళి ఉన్నట్టు సమాచారం. ఈ సెట్‌లోనే ఎక్కువభాగం షూటింగ్ జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్‌తోపాటు ఆఫ్రికా, యూరప్‌లో రాజమౌళి టీం ప్లాన్ చేస్తుందని సమాచారం. జక్కన్న లొకేషన్లను ఫైనల్ చేసి ఈ ఏడాది సమ్మర్‌లో షూటింగ్‌ మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు అని ఇన్సైడ్ టాక్.ఒకవేళ ఇదే నిజమైతే ప్రిన్స్ ఫ్యాన్స్ కి ఇంతకన్నా పెద్ద గుడ్‌న్యూస్ ఏముంటుంది చెప్పండి.

 

Read more RELATED
Recommended to you

Latest news