SSMB29 స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది- విజయేంద్ర ప్రసాద్

-

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం గుంటూరు కారం. ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్లు మాత్రం రికార్డ్ స్థాయిలో రాబడుతూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సినిమా SSMB29. ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళి చేస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అందజేస్తున్న విషయం తెల్సిందే. స్టోరీ విష‌యంలో తండ్రి కొడుకులు ఇద్దరు ఎక్క‌డా రాజీ పడ‌కుండా ప‌నిచేస్తున్నారు. ఇద్ద‌రి ఐడియాల్ని,విజువలైజేష‌న్ చేసుకుని సిద్దం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్తుందా అని ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

 

తాజాగా ఈ సినిమా గురించి విజయేంద్రప్రసాద్ ఒక ఛానెల్ ఇంటర్వ్యూలో SSMB29 స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని తెలిపారు.. గత 2 సంవత్సరాలుగా ఈ స్టోరీపైనే తండ్రీకొడుకులు కూర్చొని యుద్ధం చేస్తున్నారు. ఇక స్టోరీ పూర్తి అయ్యింది అంటే మిగతావి అన్ని లైన్ గా జరిగిపోయినట్లే. మరి ఈ చిత్రంతో ఈ కాంబో ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news