డీలిమిటేషన్ విషయంపై చర్చించేందుకు ఇవాళ చెన్నె వేదికగా తమిళనాడు సీఎం ఎం.కే స్టాలిన్ నేతృత్వంలో జేఏసీ తొలి మావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన నేతలకు సీఎం స్టాలిన్ అతిథి మర్యాదల్లో అదరగొట్టారు. వచ్చిన వారికి శాలువాలతో సత్కరించడంతో పాటు వారికి ప్రత్యేకమైన
బహుమతులతో కూడిన బాక్స్ ను అందజేశారు. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేరళన సీఎం పినరయ్ విజయన్, పంజాబ్ సీఎం భగవంత్
మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు ఆయా పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ
మీటింగ్ కు వచ్చిన వారందరిరికీ సీఎం ప్రత్యేకమైన గిఫ్ట్ బాక్సులు అందజేయడంతో అందులో
ఏమున్నాయనే క్యూరియాసిటీ అందరిలో పెరిగిపోయింది.
తమ ఆతిథ్యానికి గుర్తుగా మీటింగ్ కు హాజరైన వారికి తమిళనాడు స్వయం సహాయ బృందాల సభ్యులు రూపొందించిన ఆ రాష్ట్ర భౌగోళిక సూచిక జీఐ ట్యాగ్ చేయబడిన ఉత్పత్తులతో కూడిన గిఫ్ట్ బాక్స్ లను స్టాలిన్ అందజేశారు. అందులో తామిరపరణి నది ఒడ్డున కళాకారులు కోరై గడ్డితో నేసిన సంప్రదాయ పత్తమడై మ్యాట్, నీలగిరిలోని తోడా గిరిజనుల చేతితో తయారు చేసిన తోడా ఎంబ్రాయిడరీ శాలువా, కాంచీపురం సిల్క్ చీర, ఊటీ వర్కీ వాసన, రుచికి ప్రసిద్ధి చెందిన కన్యాకుమారి లవంగాలు వంటి గిప్ట్ బాక్స్ ను అందజేశారు.