నేడు ఢిల్లీకి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి

-

రేపు తెలంగాణకు డిప్యూటీ ఎన్నికల కమిషనర్

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) రజత్ కుమార్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్ర అసెంబ్లీ రద్దు అయిన సందర్భంగా ఎన్నికల నోటిఫికేషన్ ,రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఎన్నికల నిర్వహణపై ఢిల్లీలో భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)తో చర్చించనున్నారు.  రజత్ కుమార్ నివేదిక ఆధారంగా మంగళవారం ప్రత్యేక బృందం తెలంగాణకు రానుంది. డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలోని బృందం రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించి రాష్ట్రంలోని 11 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో  సమావేశాలు నిర్వహించనుంది. వారి నుంచి వినతులు, సలహాలను ఎన్నికల కమిషన్ స్వీకరిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news