తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ విషయం సంబంధించి మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆవేదన వ్యక్తం చేసారు. ముఖ్యంగా 8000 మంది రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. 30 ఏళ్లకు పైగా ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించిన ఠాగూర్ నారాయణ సింగ్ పరిస్థితి చూస్తే.. హృదయం కలచివేస్తుందని ఆయన పేర్కొన్నారు. అతని రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడంతో తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వ ఆరోగ్య భద్రత కార్డుతో ఆసుపత్రికి వెళ్లినా.. ఆ కార్డు చెల్లుబాటు కావడం లేదని వైద్య సేవలు అందడం లేదని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ఈ విశ్రాంత పోలీస్ ఉద్యోగికి శాపంగా మారిందని ఆయన అన్నారు. ఒక్క నారాయణ సింగ్ సమస్య కాదని.. రాష్ట్ర వ్యాప్తంగా 8వేల మంది రిటైర్డ్ ఉద్యోగుల జీవన్మరణ సమస్య అని వ్యాఖ్యానించారు హరీశ్ రావు.