బిజెపిలోనే ఉంటూ ఆమ్ ఆద్మీ కోసం పని చేయండి – కేజ్రీవాల్

-

ఈ ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే గుజరాత్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్. గుజరాత్లో ఆప్ అధికారంలోకి వస్తే.. ఢిల్లీలో మాదిరి గుజరాత్లో మంచి స్కూళ్లు, ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు హామీ ఇస్తున్నారు. అయితే ఇటీవల గుజరాత్ వెళ్లిన కేజ్రీవాల్ సూరత్ లో ఏర్పాటు చేసిన ఓ సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బిజెపిలో ముడుపులు తీసుకోవాలని.. కానీ ఆప్ కోసం పని చేయాలన్నారు. ” బిజెపి నేతలు మాకొద్దు.. మీరు అందులోనే ఉండండి. గ్రామాలు, బూత్ లలోని అనేకమంది తండోపతండాలుగా ఆమ్ ఆద్మీలో చేరుతున్నారు. ఎన్నో ఏళ్లుగా బిజెపి కోసం మీరు సేవలు చేస్తున్నారు. కానీ ప్రతిఫలంగా ఆ పార్టీ మీకు ఏమిచ్చింది? మీరు ఆ పార్టీలోనే ఉండండి.. కానీ ఆప్ కోసం పని చేయండి. చాలామందికి ఆ పార్టీ నుంచి ముడుపులు అందుతాయి. మీకు అలా ఇచ్చే అంత డబ్బు మా దగ్గర లేదు”. అని అన్నారు

Read more RELATED
Recommended to you

Latest news