స్టీల్ ప్లాంట్ మిస్సింగ్ ఉద్యోగి మీద పెరుగుతున్న కేసులు.. ఏకంగా 2 కోట్ల మోసాలు ?

-

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాస్ కోసం గాలింపు కొనసాగుతోంది. ఉద్యోగాల పేరిట రూ.2 కోట్లకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కరొక్కరిగా బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా సూసైడ్ నోట్ రాసి స్టీల్ ప్లాంట్ ఉద్యోగి కె. శ్రీనివాసరావు కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే.

శ్రీనివాసరావు చేతిలో మోసపోయిన బాధితుల సంఖ్య  పెరుగుతున్నట్టు చెబుతున్నారు. శ్రీనివాస రావు కాల్ డేటా సేకరించిన పోలీసులు, ఉద్యోగాలు ఇప్పి స్తానని నిరుద్యోగుల నుంచి అతను సుమారు రూ .50లక్షలు వసూలు చేసినట్టు  పోలీసుల విచారణలో  గుర్తించారు. ఈ అంశం బయటకు రావడంతో పోలీసులను మరికొంత మంది బాధితులు ఆశ్రయించినట్టు చెబుతున్నారు. సుమారు రూ.2 కోట్ల వరకు శ్రీనివాసరావు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news