దారుణం : ప్రభుత్వ ఆసుపత్రిలో బాలిక శవాన్ని పీక్కుతిన్న కుక్క

-

ఉత్తర ప్రదేశ్ సంబల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి ఆవరణలో ఉన్న ఒక బాలిక మృతదేహాన్ని ఒక వీధి కుక్క కొరికి తింటూ కెమెరా కంటికి చిక్కింది. వివరాల్లోకి వెళ్తే రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించిన ఓ మైనర్ బాలిక మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించబోతున్న సమయంలో పక్కన పెట్టేశారు. ఈ సమయంలో పాప బాడీ వద్ద ఎవరూ లేరు. దీంతో ఆమె కాళ్ళను కుక్క కొరుక్కుతిన్నది. దీంతో మరణించిన బాలిక తండ్రి ఆసుపత్రి అధికారులు నిర్లక్ష్యం వల్లే అలా జరిగిందని ఆరోపించారు. మృతదేహాన్ని గంటకు పైగా చూడకుండా ఉంచారు.

ఇది కచ్చితంగా ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యం అని అలా ఉన్న మృతదేహాన్ని చూసుకోవడానికి ఎవరూ లేరని ఆ మైనర్ బాలిక తండ్రి చరణ్ సింగ్ ఆరోపించారు. ఈ అంశం గురించి జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ, మృతదేహాన్ని “ఒక నిమిషం” మాత్రమే చూడకుండా అధికారులు “వదిలివేసి ఉండవచ్చు”. “ఫార్మాలిటీల తరువాత శరీరాన్ని కుటుంబానికి అప్పగించారు. వారు పోస్ట్‌మార్టం వద్దన్నారు కాబట్టి వారికి శరీరాన్ని అప్పగించేందుకు అక్కడ ఇంచారు. అది జరిగినప్పుడు వారు దానిని ఒక నిమిషం కూడా చూడకుండా ఉండి ఉండవచ్చని అన్నారు. ఇక ఈ కుక్కల భయం గురించి నేను మునిసిపాలిటీకి చాల సరాలు లేఖలు రాశాను కానీ ప్రయోజనం లేకపోయిందని అన్నారు. ఈ సంఘటన తరువాత, ఒక వార్డు బాయ్ మరియు స్వీపర్‌ ను సస్పెండ్ చేశారు. 

Read more RELATED
Recommended to you

Latest news