కరోనా డేంజర్ బెల్స్…. ఆ బ్లడ్ గ్రూప్ ఉన్న వారు జర జాగ్రత్త!

-

ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 8 వేల మందికి పైగా మృతి చెందారు. రోజు రోజుకు ఈ కరోనా మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ వైరస్ కు సంబందించిన పలు అంశాలపై పరిశోధనలు సాగిస్తున్న శాస్త్రవేత్తలు తాజాగా మరో విషయాన్నీ కనుగొన్నారు. ఇంతకీ ఆ విషయం ఏంటంటే బ్లెడ్ గ్రూప్ ‘A’ ఉన్న వారికి ఈ వైరస్ వల్ల ఎక్కువ హాని కలిగే అవకాశం ఉన్నట్లుగా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. చైనా లో కరోనా సోకిన 2 వేల మంది రక్తనమూనాలను పరీక్షించగా ఈ విషయం వెల్లడైనట్లు తెలుస్తుంది. వుహాన్‌ యూనివర్సిటీ జోంగ్‌నాన్‌ హాస్పిటల్‌లోని సెంటర్ ఫర్ ఎవిడెన్స్ బేస్డ్ అండ్ ట్రాన్స్‌లేషనల్ మెడిసిన్ విభాగానికి చెందిన జింగ్‌హువాన్‌ ఈ పరిశోధనలకు నేతృత్వం వహించారు. బ్లెడ్‌ గ్రూపు ఏ కలిగినవారికి కరోనా వైరస్‌ సంక్రమణ రేటు అధికంగా ఉంటుందని, తీవ్రమైన లక్షణాలు కనబడతాయని పరిశోధకులు తెలిపారు. మరోవైపు బ్లెడ్‌ గ్రూపు ‘O’ కలిగిన వారికి తేలికపాటి లక్షణాలు ఉంటాయని చెప్పారు. బ్లెడ్‌ గ్రూపు ఏ కలిగిన వ్యక్తులు కరోనా సంక్రమించకుండా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఒకవేళ వారికి వైరస్‌ సోకితే ఎక్కువ నిఘాతో పాటు ఇతరులతో పోల్చితే మరింత మెరుగైన చికిత్స అందించాల్సి ఉంటుందన్నారు. వుహాన్‌లో కరోనా బారినపడి మరణించిన 206 మందిలో బ్లెడ్‌ గ్రూప్‌ A’ కలిగినవారు 85 మంది, బ్లెడ్‌ గ్రూప్‌ ‘O’ కలిగినవారు 52 మంది ఉన్నారని ఆ స్టడీలో పేర్కొన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లో కూడా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 151 మందికి ఈ కరోనా వైరస్ సోకినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news