HYD: విజయవంతంగా ‘సామూహిక జనగణమన’

-

75వ స్వాతంత్ర్య దినోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నేడు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జనగణమన కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ నగరంలోని అన్ని కూడళ్ల వద్ద ఈ రోజు ఉదయం 11:30 గంటలకు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆన్‌లైన్ కనెక్టివిటి ఆధారంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు ట్రాఫిక్ పోలీసులు.

సామూహిక జనగణమన

డిజిటల్ అనౌన్స్ మెంట్ సిస్టమ్‌లో భాగంగా ఆన్‌లైన్ కనెక్టివిటీ అన్న అన్ని సిగ్నల్ వద్ద ట్రాఫిక్ పోలీసులు జనగణమన గీతాన్ని ప్లే చేశారు. దీని కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముందస్తుగా ప్రోగ్రాం చేశారు. ఆ తర్వాత టెలికాస్ట్ చేశారు. వీడియో ప్లే అయ్యే ముందు.. ‘దయచేసి అందరూ నిలబడండి. జాతీయ గీతాలాపన చేద్దాం’ అనే సందేశాన్ని వినిపించారు. ఆ తర్వాత రెండు సైరన్లు మోగిన తర్వాత జాతీయ గీతం ప్లే అయింది.

సామూహిక జనగణమన

మూడు కమిషనరేట్ల పరిధిలో ‘జనగణమన’ గీతాలాపన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ట్రాఫిక్ పోలీసులు విజయవంతంగా పూర్తి చేశారు. ప్రజలు కూడా భాగస్వాములయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version