సమ్మర్ స్పెషల్ మ్యాంగో శ్రీఖండ్ రెసిపీ..!

-

వేసవి కాలంలో మనకి మామిడి పళ్ళు దొరుకుతాయి. వీటితో కొత్త రకాలు తయారు చేసుకోవడం బాగుంటుంది. పైగా మామిడి రుచి అంటే అందరికీ ఎంతో ఇష్టం. మ్యాంగో శ్రీఖండ్ ని ఎక్కువగా గుజరాత్, మహారాష్ట్ర లో తయారు చేసుకుంటూ ఉంటారు. దీనిని మనం మామూలుగా తినేయొచ్చు లేదంటే పూరి మరియు బంగాళదుంప కూర తో తీసుకున్న బాగుంటుంది.

మ్యాంగో శ్రీఖండ్ కి కావలసిన పదార్ధాలు:

రెండు కప్పులు పెరుగు
ఒక కప్పు మామిడి గుజ్జు
అర కప్పు పంచదార పొడి
కొద్దిగా యాలుకల పొడి
ఒక టీస్పూన్ పాలు
చిటికెడు కుంకుమ పువ్వు
పిస్తా
బాదం పప్పు

మ్యాంగో శ్రీఖండ్ ని తయారు చేసే విధానం:

ముందుగా ఒక గుడ్డ తీసుకుని దానిలో పెరుగు వేయండి. దానిని ఆలా మూడు నుంచి నాలుగు గంటల సేపు వదిలేయండి. మూడు నుంచి నాలుగు గంటల తర్వాత ఆ గుడ్డ తీసేసి ఇప్పుడు బౌల్లో పెరుగుని వేసుకోండి. ఆ బౌల్ ని ఫ్రిజ్ లో పెట్టేసి ఒక గంట నుంచి రెండు గంటల సేపు వదిలేయండి.

ఈలోగా మీరూ పాలలో కొద్దిగా కుంకుమపువ్వు వేసుకోండి. ఇప్పుడు ఫ్రిజ్ లో పెట్టిన బౌల్ తీసి దానిలో పంచదార పొడి, పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు ని కూడా వేసేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపి మామిడి గుజ్జు, యాలుకల పొడి, కట్ చేసుకున్న బాదం పిస్తా మొత్తం అన్నీ వేసి ఫ్రిజ్లో ఒక గంట సేపు ఉంచండి. పైన కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ తో సర్వ్ చేసుకోవాలి అంతే.

Read more RELATED
Recommended to you

Latest news