న్యూయార్క్‌లో భార్యా పిల్లలతో మహేశ్ బాబు షికార్లు.. వైర‌ల్ అవుతున్న ఫోటోలు

-

భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు.. ఇలా వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇప్పుడు ఎన్నడూ లేనంత ఆనందంగా ఉన్నారు. ఇక మహేశ్ బాబు ప్రస్తుతం న్యూయార్క్‌లో తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నాడు. మరో మూడు నెలల వరకు విరామం తీసుకుంటానని మహేశ్ బాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల తన భార్య నమ్రత పుట్టినరోజును కూడా న్యూయార్క్‌లోనే సెలబ్రేట్‌ చేశాడు. సినిమాలు, తన కుటుంబమే ప్రపంచంగా బతికే మహేశ్ బాబు తాజాగా తన ట్విట్టర్‌ ఖాతాలో తన కుటుంబానికి సంబంధించిన ఫొటోను పోస్టు చేశాడు.

మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ తీసిన ఈ సెల్ఫీ అభిమానులను ఆకర్షిస్తోంది. ఇందులో నమ్రత, సితార కూడా ఉన్నారు. ‘ఈ సారి… గత వారం.. న్యూయార్క్.. న్యూయార్క్.. కుటుంబంతో..’ అంటూ ఆయన పేర్కొన్నాడు. కుటుంబ సభ్యులతో న్యూయార్క్‌ వీధుల్లో ఆయన ఉల్లాసంగా పర్యటిస్తున్నాడు. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నమ్రత ఎప్పటికప్పుడు తమ వెకేషన్ పిక్స్ ఇన్‌స్టాలో షేర్ చేస్తూ అభిమానులకు అప్‌డేట్స్ ఇస్తున్నారు. మ‌రి ఆ ఫోటోస్ ఓ వీడియో రూపంలో మీరు చూసేయండి..!

Read more RELATED
Recommended to you

Latest news