సుప్రీం కోర్టుకు చేరిన ‘అదానీ’ రగడ.. రేపు విచారణ

-

అదానీ గ్రూప్‌ సంస్థలపై హిండెన్‌బర్గ్‌ నివేదిక దేశంలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పార్లమెంటులో ఈ రగడ రోజూ కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని లేదా కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని గత కొన్ని రోజులుగా పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. అదానీ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని కోరుతూ పిటిషన్‌ దాఖలైంది. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టనుంది.

అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో ఓ కమిటీని ఏర్పాటు చేసేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరుతూ న్యాయవాది విశాల్ తివారీ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని సీజేఐ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్ ధర్మాసనం ముందు అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. దీనిపై ఫిబ్రవరి 10న విచారణ జరుపుతామని తెలిపింది

Read more RELATED
Recommended to you

Exit mobile version