ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు నిలుపుదల

-

రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును నిలుపుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఒక ప్రకటనలో వెల్లడించారు.2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 16వ తేదీ ఎన్నికల షెడ్యూల్ ఇక అప్పటి నుంచి అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తన నియమావళి జూన్ 4న ఓట్ల లెక్కింపు ముగిసిన తదుపరి 48 గంటల వరకు అమల్లో ఉందన్నారు.

ఎన్నికల్లో వెలువడిన ఫలితాలను బట్టి రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలకు, 175 ఎమ్మెల్యే స్థానాలకు నూతనంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఖరారు చేసారు . అంతేకాకుండా రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగియడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును నిలుపుదల చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును నేటి సాయంత్రం నుంచి నిలుపుదల చేసినట్లు జారీ చేసిన ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news