స్వాతి మలివాల్ శరీరం లో నాలుగు చోట్ల గాయాలు : AIIMS

-

ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి వ్యవహారంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఆమె పై దాడి చేసిన మాట వాస్తవమేనని AIIMS వైద్యులు నిర్దారించారు. స్వాతి ఎడమకాలు, కుడి కన్ను కింద సహా శరీరంలోని నాలుగు భాగాలకు గాయాలయ్యాయని నివేదిక ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు స్వాతి అనధికారికంగా సీఎం నివాసంలోకి ప్రవేశించి తనపై దాడి చేశారని బిభవ్ కూడా ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్ పై దాడి ఘటనలో బిభవ్ ను అరెస్టు చేశారు. సీఎం కేజ్రీవాల్ నివాసంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం అతడిని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. విచారణకు పూర్తిగా సహకారం అందిస్తామని అధికారులకు ఈమెయిల్ పంపించినప్పటికీ పోలీసుల నుంచి తమకు ఇంకా ఎలాంటి సమాచారం రాలేదని ఆయన తరపు న్యాయవాది కరణ్ శర్మ మీడియాకు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news