T20 World Cup 2024: గ్రూప్-డిలో పోటా పోటీ… దక్షిణాఫ్రికాకు కష్టమేనా?

-

జూన్ లో జరగబోయే టి20 ప్రపంచ కప్ లో పాల్గొనే 20 జట్లను నాలుగు గ్రూపులుగా ఐసీసీ విభజించింది.గ్రూప్-ఎలో భారత్, ఐర్లాండ్,పాకిస్థాన్, అమెరికా, కెనడా ఉన్నాయి. గ్రూప్-బిలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా,స్కాట్లాండ్, నమీబియా, ఒమన్ ఉన్నాయి. గ్రూప్-సిలో న్యూజిలాండ్,వెస్టిండీస్, ఆప్ఘనిస్తాన్, పపువా న్యూగినియా,ఉగాండ ఉన్నాయి. గ్రూప్-డిలో సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్, నేపాల్ ,బంగ్లాదేశ్ ఉన్నాయి.

 

అయితే మిగతా గ్రూపుల కంటే గ్రూప్-డి మాత్రం స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. గ్రూప్ – డీ నుంచి సూపర్-8కు వచ్చే టీం లను ముందే ఊహించడం కష్టం అనే చెప్పాలి. వన్డేల సంగతి పక్కనపెడితే టి20 ఫార్మాట్‌లో బంగ్లాదేశ్, శ్రీలంక గట్టి పోటీ ఇస్తాయి. అంతేకాకుండా మెగా టోర్నీలో ఇప్పటికే సౌత్ ఆఫ్రికా నెదర్లాండ్స్ పై రెండు సార్లు ఓటమిపాలైంది. గత టీ20 వరల్డ్ కప్ తో పాటు గత ఏడాది వన్డే వరల్డ్ కప్ లో సఫారీలకు నెదర్లాండ్స్ షాక్ ఇచ్చింది.అయితే మరోసారి ఈ రెండు టీం లు ఒకే గ్రూప్‌లో ఉండటం ఆసక్తి రేపుతోంది. దీంతో సౌత్ ఆఫ్రికా విజేతగా నిలవడం మరోసారి కష్టమే అని అభిమానులు అనుకుంటున్నారు. టీ20 వరల్డ్ కప్ పూర్తిస్థాయి షెడ్యూల్‌ను శుక్రవారం రాత్రి 7 గంటలకు ఐసీసీ అధికారికంగా అనౌన్స్ చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news