‘మమ్మీ ఎప్పుడొస్తుంది?’… అమాయకంగా అడుగుతున్న తహసీల్దార్ విజయారెడ్డి పిల్లలు

-

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డిపై సురేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పు అంటించిన సంగతి తెలిసిందే.. దీనితో ఆఫీసులోనే ప్రాణాలను కోల్పోయింది విజయారెడ్డి.. దీనిపై ఆమె భర్త ఆవేదన వ్యకం చేసాడు. విజయారెడ్డి దంపతులకు కుమార్తె చైత్ర (10), కుమారుడు భువనసాయి (5) ఉండగా, వారికి ఏం చెప్పి ఊరుకోబెట్టాలని తండ్రి కన్నీరు మున్నీరవుతున్నారు.

“డాడీ.. మమ్మీకి ఏమైంది? ఎప్పుడొస్తుంది?” అని ఆ ఇద్దరు బిడ్డలూ అమాయకంగా అడుగుతూ ఉంటే, వారికి సమాధానం చెప్పలేక పోతున్న బంధుమిత్రులు, వారిని దగ్గరకు తీసుకుని బోరున విలపిస్తున్నారు. రోజూ సాయంత్రం తమకు కనిపించే తల్లి కనిపించక పోవడం, ఇంటికి బంధువులంతా రావడంతో, వారెందుకు వచ్చారని కూడా పిల్లలు అడుగుతున్నారు. కాగా, విజయారెడ్డి అంత్యక్రియలను మంగళవారం అత్తగారి స్వగ్రామమైన నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వలపల్లిలో నేడు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news