రికవరీ అయ్యి ఇంటికి చేరుకున్న తమన్నా..

-

మిల్కీ బ్యూటీ తమన్నా కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. అప్పటి నుండి హైదరాబాద్ లోనే ఉన్న తమన్నా తన 14రోజుల క్వారంటైన్ తర్వాత మళ్లీ ఇల్లు చేరుకుంది. ప్రస్తుతం తమన్నా కరోనా నుండి రికవరీ అయ్యింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుండి ముంబై చేరుకున్న తమన్నా అమ్మానాన్నలని కలుసుకుంది. ఈ మేరకు తమన్నా ఒక వీడియోని పెట్టింది.

ఇన్స్టాగ్రామ్ వేదికగా తమన్నా షేర్ చేసిన ఈ వీడియో చాలా ఎమోషనల్ గా ఉంది. ఇల్లు చేరుకున్న తమన్నా తన అమ్మానాన్నలని సంతోషంగా కౌగిలించుకుంది. మొత్తానికి కరోనాని విజయవంతంగా జయించింది. ప్రస్తుతం తమన్నా, నితిన్ హీరోగా చేస్తున్న అంధాధున్ తెలుగు రీమేక్ లో ఒకానొక ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ లో టబు పోషించిన పాత్రలో తమన్నా నటిస్తుంది. మొదటిసారిగా తన కెరీర్లోనే వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తున్న తమన్నా ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version