అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చేరిన త‌మిళ‌ స్టార్ హీరో

-

తమిళ స్టార్ హీరో శింబు తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యాడు. దీంతో నిన్న రాత్రి చెన్నై లో ని ఒక ప్రయివేటు ఆస్ప‌త్రి లో హీరో శింబు చేరాడు. అయితే హీరో శింబు కు తీవ్ర ఇన్ఫెక్ష‌న్ కు గురి అయ్యాడ‌ని సమాచారం. దీంతో హీరో శింబు అధిక జ్వ‌రం తో పాటు గొంతు సంబంధిత సమ‌స్య‌లు ఉన్నాయ‌ని.. అందుకే ఆస్ప‌త్రి లో చేరాడ‌ని తెలుస్తుంది. అయితే హీరో శింబు కు కరోనా వైర‌స్ సోక‌లేద‌ని డాక్ట‌ర్లు వెల్ల‌డించిన‌ట్టు తెలుస్తుంది.

ఆయ‌న గొంతు కు కాస్త ఇన్ఫెక్ష‌న్ వ‌చ్చింద‌ని డాక్టర్లు వెల్ల‌డించార‌ని స‌మాచారం. అయితే దీని పై పెద్ద గా టెన్ష‌న్ ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని రెండు.. మూడు రోజుల్లో హీరో శింబు ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జీ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని డాక్ట‌ర్లు చెప్పార‌ని తెలుస్తుంది. కాగ తమిళ స్టార్ హీరో శింబు ప్ర‌స్తుతం గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం గ‌త కొద్ది రోజ‌ల నుంచి షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అయితే శింబు షూటింగ్ లో ఉన్న స‌మ‌యం లో నే తీవ్ర గొంతు నొప్పి రావ‌డం తో ఆస్ప‌త్రి లో చేరాడ‌ని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news