Breaking : పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు సిఫార్స్ చేసిన తమిళిసై

-

 పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు. రాష్ట్రపతి పాలనకు లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి సమయంలో పుదుచ్చేరి అసెంబ్లీ ని రాష్ట్రపతి రద్దు చేసినట్లు చెబుతున్నారు.

ram nath kovind orders to home ministries for telangana inter students suicide report
ram nath kovind orders to home ministries for telangana inter students suicide report

ఇక నిన్న నారాయణస్వామి బలపరీక్షలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన నేరుగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిసి తన రాజీనామా లేఖ సమర్పించారు. ఈ నేపధ్యంలో ఆమె రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయగా దానిని రాష్ట్రపతి ఆమోదించారు. ఇక త్వరలోనే అక్కడ అసెంబ్లీకి ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ సారి అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందనేది. 

Read more RELATED
Recommended to you

Latest news