ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో భేటీ అయిన టీడీపీ నేత‌లు..

-

ఈనెల 14న ఇసుక కొరతపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టనున్న దీక్షకు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. విజయవాడలోని ధర్నా చౌక్ లో రేపు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ఈ నేపథ్యంలో, విజయవాడలోని పవన్ కల్యాణ్ నివాసానికి టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య వెళ్లారు. చంద్రబాబు దీక్షకు మద్దతు తెలపాల్సిందిగా ఈ సందర్భంగా కోరారు. ప్రస్తుతం వీరి భేటీ కొనసాగుతోంది.

మరోవైపు, విశాఖలో ఇటీవల పవన్ కల్యాణ్ చేపట్టిన లాంగ్ మార్చ్ కు టీడీపీ సంఘీభావం ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, స్వయంగా టీడీపీ నేతలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు దీక్షపై పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news