చంద్రబాబు కాన్వాయ్​పై దాడి.. ఇవాళ గవర్నర్​కు టీడీపీ ఫిర్యాదు

-

టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్​పై దాడి ఘటన గురించి ఆ పార్టీ నేతలు ఇవాళ గవర్నర్​ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. కేసులో పురోగతి లోపించిందని, నిందితులను పట్టుకోవడంలో జాప్యం చేస్తున్నారని గవర్నర్​కు వివరించనున్నారు. రాళ్లదాడి ఘటనపై ఇప్పటికే నందిగామ పోలీస్ స్టేషన్​లో చంద్రబాబు సీఎస్​ఓ మధుబాబు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఫిర్యాదు చేయగా, పోలీసులు నామమాత్రపు బెయిలబుల్ కేసు నమోదు చేశారని వారు విమర్శించారు.

ఎన్టీఆర్​ జిల్లా నందిగామలో ఈనెల 4న చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని, గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరిన ఘటనకు సంబంధించి ఇంకా నిందితుల ఆచూకీ దొరకలేదు. ఘటన జరిగి మూడ్రోజులైనా, దర్యాప్తు కొలిక్కి రాలేదు. ఇందులో రాజకీయ కారణాలు ఇమిడి ఉండడమే ఇందుకు కారణమని తెలుగుదేశం ఆరోపిస్తోంది. అనుమానితుల కదలికలపై ఫొటోలు విడుదల చేసింది. ఈ క్రమంలోనే పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నేతృత్వంలో ఆరుగురు సభ్యుల బృందం ఇవాళ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్​ను కలవనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version