‘మహానాడు’కు భారీగా తరలిన తెదేపా శ్రేణులు

-

ఒంగోలులో రేపటి నుంచి ప్రారంభం కానున్న తెదేపా మహానాడుకు పార్టీ శ్రేణులు భారీగా తరలి వెళ్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల ముఖ్య నేతలు, కార్యకర్తలు ఒంగోలు చేరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ముఖ్య నేతలు భారీ ర్యాలీగా మహానాడుకు బయల్దేరారు. చంద్రబాబు కాన్వాయ్‌ను అనుసరిస్తూ.. కొన్ని వందల సంఖ్యలో వాహనాలు బయలుదేరుతున్నాయి. మంగళగిరి నుంచి కార్లు, ద్విచక్ర వాహనాలతో తరలి వెళ్లాలి.

చంద్రబాబు-తెదేపా

చిలకలూరిపేట, అద్దంకి, మార్టూరు వద్ద పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు ర్యాలీలో కలవనున్నారు. ఒంగోలు నగర పరిధిలోని త్రోవగుంట వద్ద చంద్రబాబు చేరుకుంటారు. అక్కడి నుంచి మంగమూరు రోడ్డు, చర్చి సెంటర్ మీదుగా హోటల్ సరోవర్‌కు చేరుకుంటారు. అనంతరం సాయంత్రం వేళ.. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలు, తీర్మానాలపై చర్చించనున్నారు. పార్టీ భవిష్యత్ కార్యచరణపై మాట్లాడనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version