టీడీపీ ఎమ్మెల్యేలు మమ్మల్ని కొట్టారు, విచారణకు రెడీ అన్న స్పీకర్

-

ఏపీ అసెంబ్లీ సమావేశాలలో ఇప్పుడు ఆసక్తికరంగా పరిణామాలు ఉన్నాయి. సమావేశాలు జరుగుతున్న సమయంలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్నారు. దీనితో సభా సమయం మొత్తం కూడా వృధా అవుతుంది. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యేలను రెండు రోజుల క్రితం స్పీకర్ సస్పెండ్ చేసారు. చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటకు పంపించారు.

అయితే ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు మార్షల్స్ మీద దాడి చేసారు. తమపై టీడీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని స్పీకర్‌ తమ్మినేనికి మార్షల్స్‌ ఫిర్యాదు చేసారు. సస్పెండైన ఎమ్మెల్యేలను తీసుకెళ్లడానికి వస్తే.. తమపై దాడి చేశారని స్పీకర్‌ తమ్మినేనికి మార్షల్స్‌ వివరించారు. మార్షల్స్‌ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన స్పీకర్ తమ్మినేని విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version