గ్రేటర్ వార్ : పాపం ఆ టీడీపీ అభ్యర్ధికి కరోనా !

-

ఎన్నికల తేది దగ్గర పడుతున్నకొద్ది గ్రేటర్‌ ఎన్నికల ప్రచార వేడి పీక్‌ స్టేజ్‌ కు చేరుకుంటోంది. ప్రచార పర్వం వేడెక్కుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలతో పార్టీలు హోరెత్తిస్తున్నాయి..ప్రతి రోజులు మిడ్ నైట్ వరకూ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అయితే గ్రేటర్‌ ఎన్నికల్లో వందకుపైగా స్థానాల్లో పోటీ చేస్తోన్న టీడీపీ ప్రచారంలో ఎలాంటి హడావిడి కనిపించడం లేదు.

tdp

చంద్రబాబు, లోకేష్‌, బాలయ్యలు ప్రచారానికి వస్తారని భావించినా.. అటువంటి సందడే లేదు. ఒకప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలంటే సిటీలో వాలిపోయే ఏపీ టీడీపీ నేతలు ఇప్పుడు అసలు ఈ వైపే చూడడం లేదు. అయితే తాజాగా సనత్ నగర్ టిడిపి అభ్యర్థి కానురి జయశ్రీకి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె తరపున ఇతర నాయకులు ప్రచారం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version