ఆ టీడీపీ సీనియ‌ర్ నేత అనారోగ్యంతో కన్నుమూత‌..

-

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన బెజవాడ ఓబుల్‌రెడ్డి నిన్న కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ఓబుల్‌రెడ్డి మృతితో టీడీపీ ఓ సీనియర్‌ నేతను కోల్పోయిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. గత 30 ఏళ్లుగా ఓబుల్‌రెడ్డి టీడీపీలో రాష్ట్ర సీనియర్‌ నాయకుడిగా ఉన్నారు.

 

రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రైతు సమస్యలపై పోరాడిన నేతగా ఓబుల్‌రెడ్డికి మంచి గుర్తింపు ఉంది. రాష్ట్ర మంత్రులు అనిల్‌, గౌతంరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి ఓబుల్‌రెడ్డి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news