ఆ వైసీపీ ఎంపీ మందు తాగి వెళ్లాడా…. జ‌గ‌న్ వార్నింగ్‌…!

-

ఎన్నికల సమయంలోనే ప్రచారానికి మందు తాగి వెళ్లాడని ఓ వైసీపీ నేత గురించి ఓ వీడియో అప్పట్లో బాగా వైరల్ అయింది. పార్టీ అభిమానులు, కార్యకర్తలతో సదరు వైసిపి నేత నిర్వహించిన ప్రచారంలో ఆయన తూలిపోతూ మాట్లాడడంతో సదరు నేత మందు తాగి వచ్చాడు అని అందరూ అనుకున్నారు. గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన ఆ నేత తీరు ఇంకా అలాగే కంటిన్యూ అవుతుందని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కూడా ఆయన తాగి ఊగినట్టుగా ప్రచారం సాగుతూ ఉంది. కేంద్ర మంత్రులను  కలవడానికి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా పార్టీకి చెందిన ప‌లువురు ఎంపీలు జ‌గ‌న్‌ను క‌లిశారు. ఆయ‌న వెంట వారు కేంద్ర‌మంత్రుల ద‌గ్గ‌ర‌కు కూడా వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే ఆ ఎంపీ మ‌ళ్లీ తాగి వ‌చ్చాడ‌ట‌. తాగుడుకు గ‌ట్టిగా అల‌వాటు ప‌డ్డ ఆ ఎంపీ మామూలు రోజుల్లో కూడా విప‌రీతంగా తాగేసి బ‌య‌ట‌కు వ‌స్తాడ‌ని అంటున్నారు. ఈ విష‌యం ఇప్పుడు సొంత పార్టీ నేత‌ల మ‌ధ్యే బాగా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆయ‌న తాగి ప్ర‌చారం చేసిన‌ట్టు వ‌చ్చిన వార్త‌ల‌ను అప్ప‌ట్లో ఖండించినా ఢిల్లీలో మాత్రం జ‌గ‌న్ ముందే అడ్డంగా బుక్ అవ్వ‌డంతో ఆయ‌న ఏం స‌ర్దిచెప్పుకోలేని ప‌రిస్థితి.

చివ‌ర‌కు జ‌గ‌న్‌ను క‌లిసేందుకు వ‌చ్చిన‌ప్పుడు కూడా కొంత మోతాదులో మ‌ద్యం తీసుకుని రావ‌డం పార్టీ వ‌ర్గాల్లోనే చ‌ర్చ‌నీయాంశంగా మారింది. చివ‌ర‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవడానికి వెళ్లినప్పుడు కూడా ఆ ఎంపీ పరిస్థితి అంతేనట. స‌ద‌రు ఎంపీ తీరుపై జ‌గ‌న్ తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డంతో పాటు వార్నింగ్ ఇచ్చిన‌ట్టు పార్టీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news