టీజర్:ఆదిపురుష్.. అప్డేట్ చెప్పిన డైరెక్టర్ ఓంరౌత్..?

-

సినీ ప్రేక్షకులు సైతం ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాలలో ఆదిపురుష్ సినిమా కూడా ఒకటి. ఇందులో హీరో ప్రభాస్ ముఖ్యమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఇక కీలకమైన పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్, హీరోయిన్ గా కృతి సనన్ నటిస్తున్నది. ఇక ఈ చిత్రాన్ని దర్శకత్వం బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని దాదాపుగా రూ.500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తు ఉన్నారు. ఇక ఈ సినిమా వచ్చే యేడాది జనవరి 12వ తేదీన విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి.

అయితే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి అయినప్పటికీ ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అయితే ఈ సినిమా నుంచి కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేయకపోవడంతో అభిమానులు సైతం అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని అక్టోబర్ 2వ తేదీన అయోధ్యలో విడుదల చేయబోతున్నట్టుగా వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయంపై డైరెక్టర్ ఓం రౌత్ స్పందించడం జరిగింది. వాటి గురించి చూద్దాం.


ఓం రౌత్ ఇలా స్పందిస్తూ.. మీ మ్యూజికల్ ప్రయాణం ఇప్పుడు మీ అనుభవం.. మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆది పురుష్ సినిమా టీజర్ అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ అక్టోబర్ 2వ తేదీన ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో బ్యాంక్ ఆఫ్ సరయు వేదికగా రిలీజ్ చేయబోతున్నట్లు తెలియజేశారు. ఈ సినిమా వచ్చేయడాది జనవరి 12వ తేదీన త్రీడీలో విడుదల చేయబోతున్నట్లు ఒక ఫిట్ చేశారు దీంతో ప్రభాస్ అభిమానులు కాస్త కుషి అవుతున్నారని చెప్పవచ్చు. అయితే ఈ వేడుకకు ప్రభాస్ కృతి సనన్ హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version