Telangana:సీఎంతో మైక్రాన్ కంపెనీ సీఈవో భేటీ

-

ప్రపంచంలోనే అతి పెద్ద మెమరీ చిప్ తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్, సీఈవో సంజయ్ మెహ్రోత్రా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు. అమెరికా నుంచి ప్రత్యేకంగా ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చిన సంజయ్ మెహ్రోత్రా ఈరోజు సాయంత్రం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను కలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం ఉందని సంతోషం వ్యక్తం చేశారు.

మైక్రాన్ కంపెనీ ఆసక్తి చూపితే తెలంగాణ ప్రభుత్వం తగిన సహాయ సహకారాలను అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. నైపుణ్యాల అభివృద్ధి, పరిశ్రమల స్థాపన,ఉపాధి కల్పనతో పాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన ఈ సంస్థ సెమీ కండక్టర్ల తయారీలో ప్రపంచంలోనే 4 వ అతిపెద్ద కంపెనీ. మెమరీ చిప్ తయారు చేసే అతి పెద్ద సంస్థల్లో మైక్రాన్‌ ఒకటి.

Read more RELATED
Recommended to you

Latest news