విశాఖ వాసుల‌కు శుభ‌వార్త‌.. విద్యార్థుల‌కు ఫ్రీ.. రెండో టెస్టు మ్యాచ్ టికెట్ల విక్ర‌యాలు ఎప్పుడంటే..?

-

విశాఖ న‌గ‌రము చాలా రోజుల త‌రువాత ఓ అంత‌ర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వ‌నుంది. టీమ్ఇండియా ప్ర‌స్తుతం అఫ్గానిస్తాన్‌తో మూడు టెస్టు మ్యాచుల సిరీస్ ముగిసిన అనంతరం ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడ‌నుంది. ఇండియా, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న రెండో టెస్టు మ్యాచ్ విశాఖ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. దీంతో ఈ టెస్టు మ్యాచ్‌ను దాదాపు నాలుగేళ్ల తర్వాత ప్ర‌త్య‌క్షంగా చూసే అవ‌కాశం విశాఖ వాసుల‌కు క‌లుగ‌నుంది.

డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలో ఫిబ్ర‌వ‌రి 2 నుంచి 6 వ‌ర‌కు ఇండియా, ఇంగ్లాండ్ మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.ఈ నెల 15 నుంచి ఆన్‌లైన్‌లో 26 నుంచి ఆఫ్‌లైన్‌లో టికెట్లు విక్రయించనున్నారు. ఆఫ్‌లైన్‌లో టికెట్ల‌ను స్వర్ణ భారతి స్టేడియంతో పాటు ఏసీ ఏ విడిసిఏ స్టేడియంలో విక్ర‌యించ‌నున్నారు. అంతేకాకుండా ప్ర‌తి రోజు 2వేల మంది విద్యార్థుల‌కు మైదానంలోకి ఫ్రీగా మ్యాచ్ను చూసే అవకాశం క‌ల్పించ‌నున్నారు.

 

మొద‌టి టెస్టు –ఉప్ప‌ల్‌ – జ‌న‌వ‌రి 25 నుంచి 29 వ‌ర‌కు

రెండో టెస్టు – విశాఖ‌ప‌ట్నం -ఫిబ్ర‌వ‌రి 2 నుంచి 6 వ‌ర‌కు

మూడో టెస్టు – రాజ్‌కోట్‌ -ఫిబ్ర‌వ‌రి 15 నుంచి 19 వ‌ర‌కు

నాలుగో టెస్టు – రాంచీ -ఫిబ్ర‌వ‌రి 23 నుంచి 27 వ‌ర‌కు

ఐదో టెస్టు – ధ‌ర్మ‌శాల‌ -మార్చి 7 నుంచి 11 వ‌ర‌కు

Read more RELATED
Recommended to you

Latest news