Telangana: యూరియా కొరతకు సంబంధించిన సమస్యలపై సమీక్ష -మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

-

నిర్మల్ జిల్లాలో యూరియా కొరతకు సంబంధించిన సమస్యలపై సెక్రటేరియట్ లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావ్ డైరెక్టర్ అగ్రికల్చర్ తో సమీక్ష నిర్వహించారు. దీనిపై వ్యవసాయ సంచాలకులు సమాధానమిస్తూ లారీల సమ్మె కారణంగా యూరియా కొరత ఏర్పడిందని చెప్పారు .ప్రస్తుతం అన్ని జిల్లాల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

ఇటీవల మిర్చి ధర, తెగుళ్ల నియంత్రణ చర్యలు, మార్కెట్ సంబంధిత సమస్యల గురించి మంత్రి తుమ్మల సమీక్షించారు.రాష్ట్రంలో వివిధ పంటలకు కావాల్సిన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండేలా చేసుకోవాలని ఆదేశించారు. రైతు వేదికలను సమర్థవంతంగా వినియోగిస్తూ రైతుల ఆదాయం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రం లో పండిన వరి పంటను చేసుకునే లాగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించే విధంగా ప్రణాళికలు సిద్ధ చేయాలని అన్నారు. వ్యవసాయ ఉద్యోగుల అన్నీ సంఘాల ప్రతినిధులతో వారి వివిధ సమస్యల పై సమీక్ష నిర్వహించమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news