10 మందితో తెలంగాణ బీజేపీ ఫస్ట్ లిస్ట్….!

-

ఈ నెల 24న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. తెలంగాణలో లోక్సభ అభ్యర్థుల ఎంపికపై అగ్రనేతలు చర్చించనున్నారు. ఈ సమావేశంలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్,ఈటల రాజేందర్ పాల్గొననున్నారు. లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తొలి జాబితాలో తెలంగాణ నుంచి 10 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం. ఈ భేటీ నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన వాయిదా పడింది.

మార్చి 2 న అమిత్ షా రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. 10 సీట్లకు తగ్గకుండా గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్నది. ఈ నేపథ్యంలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు ప్రారంభించనుంది. 114 అసెంబ్లీ, 17 ఎంపీ నియోజకవర్గాల్లో రథయాత్రలతో పాటు 106 సమావేశాలు, 102 రోడ్ షోలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news