ఆపదలో అండగా నిలిచి.. శభాష్ అనిపించుకున్న బండి సంజయ్..!

-

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మానవత్వాన్ని చాటుకున్నారు. పున్నం రమేష్, రమ, సంకీర్తన్ అనే ముగ్గురు వ్యక్తులు బైక్ పై హుజురాబాద్ నుంచి కరీంనగర్ కు ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఆ సమయంలో వరంగల్ జిల్లా పర్యటన కోసం ఆ మార్గంలో వెళుతున్న బండి సంజయ్ ప్రమాదానికి గురైన వారిని చూసి చలించారు.

క్షతగాత్రుల వివరాలు తెలుసుకొని, తన సొంత కారులో వారిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కాగా, ఈ ఘటన మానకొండూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది.

అలాగే మహబూబాబాద్ జిల్లా గూడూరులో ప‌ర్యటించిన ఆయన.. మరోసారి కేసీఆర్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్ అండతోనే ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని.. నర్సంపేట నడిబొడ్డున రూ.25 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version