తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. 24 గంటల్లో 647 కేసులు

-

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు తగ్గు ముఖం పడుతోంది. తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 24 గంటల్లో 647 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 6,40,659 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 02 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు 3780 మంది కరోనా మహమ్మారి తో మరణించారు.

ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసులు 9,625 గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 6,27,254 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. గత 24 గంటల్లో 749 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో రికవరీ రేటు 97.90 శాతంగా ఉంది.

ఇండియా రికవరీ రేటు 97.32 శాతంగా ఉంది. తెలంగాణలో మరణాలు 0.59% గా ఉన్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,20,213 పరీక్షలు చేశారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పరీక్షలు సంఖ్య 2,12,24,462 కు చేరుకుంది. మొన్నటి వరకు విపరీతంగా పెరిగిన కేసులు… ప్రస్తుతం తగ్గుముఖం పట్టడం శుభసూచకం.

 

Read more RELATED
Recommended to you

Latest news