తెలంగాణ ప్రజలకు భారీ ఊరట..24 గంటల్లో 869 కేసులు

-

తెలంగాణ రాష్ట్రంలో కరోనా తీవ్రత కూడా భారీగా తగ్గుతోంది. తెలంగాణలో మొన్నటి వరకు భారీగా పెరిగిన కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 24 గంటల్లో 869 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 6,24,379 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 08 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు 3669 మంది కరోనాతో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసులు 13,052 గా ఉన్నాయి.


ఇక ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 6,07,658 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. గత 24 గంటల్లో 1197 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో రికవరీ రేటు 97.32 శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 96.93 శాతంగా ఉంది. తెలంగాణలో మరణాలు 0.58% గా ఉన్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,05, 123 పరీక్షలు చేశారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పరీక్షలు సంఖ్య 1,87,77,030 కు చేరుకుంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version