తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా.. కొత్తగా 173 కేసులు

-

తెలంగాణ రాష్ట్రంలో కరోనా తీవ్రత కూడా భారీగా తగ్గుతోంది. ఏపీలో కంటే తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉంది. తెలంగాణలో మొన్నటి వరకు భారీగా పెరిగిన కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 24 గంటల్లో 174 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 6,63, 454 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ఒకరు మరణించారు.

దీంతో ఇప్పటి వరకు 3904 మంది కరోనాతో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసులు 5005 గా ఉన్నాయి.ఇక ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 6,54, 545 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. గత 24 గంటల్లో 315 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో రికవరీ రేటు 96.65 శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 97.65 శాతంగా ఉంది. తెలంగాణలో మరణాలు 0.58% గా ఉన్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 35, 160 పరీక్షలు చేశారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పరీక్షలు సంఖ్య 2, 58,51 ,688 కు చేరుకుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news