రేపు సాయంత్రంలోగా మునుగోడు నుంచి వారంతా వెళ్లిపోవాలి : సీఈవో వికాస్‌రాజ్‌

-

మునుగోడు ఉపఎన్నికల ప్రచారం రేపు సాయంత్రంతో ముగియనుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రచార గడువు ముగుస్తున్నందున రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఎన్నికల నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. రేపు సాయంత్రం 6 గంటల తర్వాత బయటి వారు ఎవరూ నియోజకవర్గంలో ఉండరాదని స్పష్టం చేశారు.

మునుగోడు నియోజకవర్గం మొత్తం రేపు సాయంత్రం విస్తృత తనిఖీలు చేయాలని అధికారులు, బృందాలను ఆదేశించినట్లు వికాస్‌రాజ్ చెప్పారు. పెద్దమొత్తంలో ఎస్సెమ్మెస్‌లపై నిషేధం ఉందని, సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం చేయరాదని స్పష్టం చేశారు. వివిధ రూపాల్లో ఇప్పటి వరకు 479 ఫిర్యాదులు వచ్చాయని, 185 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఇప్పటి వరకు రూ.6 కోట్ల 80 లక్షల నగదు, 4,500 లీటర్లకు పైగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వికాస్‌రాజ్‌ వెల్లడించారు. 111 బెల్ట్ షాపులు మూసివేసినట్లు చెప్పారు. ఓటర్లలో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టామని, ఫిర్యాదుల కోసం సీవిజిల్ యాప్ ఉపయోగించుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో 105 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామన్న వికాస్ రాజ్.. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version